కుమారీ శతకం కర్త శ్రీ పక్కి వెంకట నరసింహ కవి. వీరి గురించి వివరములు లభ్యము కాలేదు
యవ్వన దశలో ఉన్న పడతులకు మార్గ దర్శకముగా చెప్పబడినవి ఈ పద్యాలు. కవి ఈ పద్యములను ఆనాటి పడతులు చదివిన సద్గుణములు, వివాహ సౌఖ్యము, పతిభక్తీ అలవడునట్లు మార్గదర్శకముగా రాసారని చెప్పవచ్చు. పుట్టింటినందు, మెట్టింటినందు ఎలా మసలుకోవాలో తెలియబర్చేవిగా ఉంటాయి. ఈ పద్యముల ఫలశ్రుతిగా పై విషయములను చెప్పుకోవచ్చును.
ఈ పద్యాలకు మకుటం, కుమారీ అన్న పదమే. భాష కొంచం గ్రాంధికంగా, చందోలంకార బద్ధంగా ఉంటుంది. చాలా పద్యాల భావం నేటి కాలం యువతికి మార్గదర్శకంగా ఉంటాయి.
No comments yet.